*కరోనా వైరస్ నేపథ్యంలో ఆలయముకు వచ్చు భక్తులు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు ఆలయ తెరుచు వేళలు: ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6.30 వరకు మాత్రమే ప్రతి ఒక్కరు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకొని, థర్మల్ స్కానింగ్ అనంతరం లోనికి రావలెను. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి మాత్రమే ఆలయం లోనికి రావలెను. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించవలెను. దేవస్థానం నందు అన్నదానం, ప్రసాద వితరణ నిలుపుదల చేయడమైనది. మన జాగ్రత్తతో కరోనాను ప్రాలదోలుదాం - కార్యనిర్వాహణాధికారి *ఈ ఆలయం పేరుతో విరాళములు కోరుతూ ఆన్లైన్ నందు ఎటువంటి వెబ్సైట్ గానీ, ఫేస్ బుక్ పేజీగానీ, ఫోన్ పే, గూగుల్ పే గానీ లేవు. విరాళములు మరియు ఆభరణములు ఇచ్చువారు ఆలయం వద్ద మాత్రమే చెల్లించి తగురశీదు పొందవలెను. ఎవరైనా వ్యక్తులు, సంస్ధలు విరాళములు అడిగినచో 8519992475 నకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవలసిందిగా తెలియజేయడమైనది. - కార్యనిర్వహణాధికారి
AutoMov

ఆలయ చరిత్ర

పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కీకారణ్యము. ధ్రువుని తల్లి సునీత. ధ్రువుని సవతి తల్లి ధ్రువుడు సింహాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది. సునీత, ధ్రువుని పిలిచి నీవు సింహాసనం అధిష్టించి, రాజ్యపాలన చేయాలి. అందుకు శ్రీ మహా విష్ణువు దర్శన భాగ్యం కలగాలి. ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది. అందుచేత తపమాచరించి, విష్ణు దర్శనం పొంది, రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది. అలా బయలుదేరిన ధ్రువుడు, ఈ కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నాడు. అచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉంది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధ్రువుని చూచి, అతని మనసులోని కోరిక తెలిసినవాడై, ముని అతన్ని పిలిచి “నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకొంటూ తపస్సు చెయ్యి. స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు. మునీశ్వరులు చెప్పినట్లుగా తపమాచరించుట మొదలుపెట్టినాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత, ధృవుని తపస్సుకి మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధృవుడు భయపడ్డాడు. అంతట విష్ణువు “బాలక భయమెందుకు తత్తరపాటు చెందకు నేను నీ అంతే కదా ఉన్నాను” అని నవ్వుతూ పలుకటయే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయము లేకుండా చేసాడు. స్వామి అక్కడే శిలారూపంలో వెలసినాడు....

AutoMov